అరకులో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగుడ మండలం కోరాయి పంచాయితీ బొందుగుడా గ్రామంలో జన సేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన 5 లక్షల బీమా పథకం ద్వారా ప్రతి యొక్క జనసైనిక కుటుంబాలకు అండగా ఉంటుందని వివరించి డంబ్రిగుడా మండల అధ్యక్షులు కొన్నెడి చిన్నారావు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వర్కింగ్ కమిటీ కొన్నేడీ లక్ష్మణ రావు మరియు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదల శ్రీరాములు, నియోజకవర్గ నాయకులు బంగరు రామదాసు, నియోజకవర్గ నాయకులు సంతోష్ సింగ్, సోబోయి రాజు, కీల్లో రాజ్ భరత్, అల్లంగి రామకృష్ణ పాల్గొన్నారు.