దొరవలస గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ..

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం, చిన్నాలబుడు పంచాయతీ పరిధిలో గల దొరవలస గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జన సైనికులకు వీర మహిళకు బీమా కిట్లను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దూరియా, పార్టీ మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, మండల నాయకులు ఎం ప్రసాద్, కీల్లో రాజా, భరత్, జనసేన వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. మన జనసేన పార్టీ అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని.. 2024లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.