క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయండి: వరికూటి నాగరాజు

దర్శి: జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్న జనసేన పార్టీ 3వ విడత క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఫిబ్రవరి 10వ తారీకు నుండి 28వ తారీకు లోపు నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించిన సందర్భంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని తెలియజేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోలేని సంచలన నిర్ణయాన్ని కేవలం 500 రూపాయల సభ్యత్వ నమోదుతో 5,00,000/- లక్షల ప్రమాద బీమా పథకాన్ని అందజేస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అంటూ, మనందరి కోసం వారి సొంత డబ్బును కూడా పార్టీ కోసం ఖర్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కువ సభ్యత్వ కార్యక్రమాలు చేయాలని శుక్రవారం నాగరాజు వారి కార్యాలయంలో తెలియజేశారు.