పాలవలస గ్రామంలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలంలో గిరిజన గ్రామాలు అయిన పాలవలస గ్రామంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు జనసేన చేపట్టిన షణ్ముఖ వ్యూహం గురించి ప్రజలకు వివరించి.. అప్పుల ఆంధ్రాని కాపాడే ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తోనే సాధ్యం అని తేలియజేయటం జరిగింది. జనసేన అధ్యక్షులు యువశక్తి కార్యక్రమంలో చేసిన తీర్మానం గురించి కుడా తేలియజేయటం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ ఏకమై రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రుంకు కిరణ్, గెల్లంకి కిషోర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.