విశాఖ తూర్పు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా సభ్యత్వ కిట్ల పంపిణీ

విశాఖ తూర్పు నియోజకవర్గం, ఆదివారం ఉదయం విశాఖ తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ జనరల్ సెక్రెటరీ ఎం. నాని, జనసేన పార్టీ జివిఎంసి 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ మరియు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వీర మహిళ ఇంచార్జ్ సార్ని దేవి, నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా ఉండి వారి చేతుల మీదుగా క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు మరియు క్రియాశీలక సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.