పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్వర్యంలో అన్నదానం

జనగామ: భారత జాగృతి జనగామ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ చిదురాల రాజు, రజినీ వారి కుమార్తె జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో శనివారం అన్నదానం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర గూడ ప్రసాద్, కొడ బోయిన రాజు, మంగ శ్రీకాంత్ జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.