పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో అన్నదానం

జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో రమ్య పుట్టినరోజు సందర్భంగా మిట్టిపెళ్లి సాయి ఆధ్వర్యంలో అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, నరేంద్ర పవన్, శివ, నరేష్, ఎల్లేష్, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.