వారి ఓట్లు తొలగించకండి: బొమ్మిడి నాయకర్

నరసాపురం: నరసాపురం నియోజకవర్గ వాసులు(ఓటర్లు) ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా వారి వారి గ్రామాలలో ఆ ఓట్లు ఉండేటట్లు చూడాలి అని నరసాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ సవినయంగా వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, నిప్పులేటి తారకరామారావు, భారతి సురేష్, పోలిశెట్టి సాంబ, పెమ్మాడి కిరణ్, లక్కు బాబి, కూనపరెడ్డి రామకృష్ణ, గ్రంధి నాని, బొమ్మిడి రామ్మూర్తి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.