ఎర్రగుంట్ల పల్లిలో బాబు ష్యురిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ

పుంగనూరు: “బాబు ష్యురిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా.. గురువారం పుంగనుర్ మండలం నేతిగుట్ల పల్లి పంచాయితీ ఎర్రగుంట్ల పల్లిలో జనసేన, టిడిపి నాయకులు పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ వైసిపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకుని రాబోయే టిడిపి జనసేన ప్రభుత్వంలో తెలుగుదేశం- జనసేన పార్టీలు ఆములు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ, పుంగనూరు మండల అధ్యక్షుడు విరుపాక్షి, టీడీపి నాయకులు మాధవ్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు నరేష్ రాయల్, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, నాయకులు కోలాట వెంకట రమణ, శమిపతి, అంజి రెడ్డి, కల్స్టర్ గంగాధర్, మాజీ సర్పంచ్ రమణ, మురళి రాయల్, బాలాజీ నాయక్, టి గంగాధర్, ధర్మ తేజ లు పాల్గొన్నారు.