పవనన్న ప్రజాబాటలో విస్తృతంగా పర్యటిస్తున్న డా. కందుల!

వైజాగ్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు విస్తృతంగా పర్యటిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 30వ వార్డు సాలిపేటలో ఇటీవల పుష్పవతి అయిన వడ్డాది దీపికకు, 33వ వార్డు ఎస్సీ కాలనీలో ఇటీవల పుష్పవతి అయిన ఘనది ఎస్తేర్ కుమారికు, 34వ వార్డు లక్ష్మీదేవి పేటలో ఇటీవల పుష్పవతి అయిన గంటి వాసవిక కు పట్టు వస్త్రాలు, గాజులు, పసుపుకుంకాలు బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉసిరికాయల యజ్ఞేశ్వర, వాసుపల్లి నరేష్, నీలం రాజు, శ్రీహరి,కుమారి, దేవి, మణి, వర, జానకి, శ్రీదేవి, కోదండమ్మ, దుర్గ, జ్యోతి, ప్రభావతి, ఝాన్సీ, పోలిచిట్టి, చిరంజీవి, రాజా, నరేష్, రమేష్, ఈశ్వరరావు, టమాట అప్పారావు, సతీష్, భద్రి, దక్షిణ జనసేన యువ నాయకులు కందుల కేదార్ నాథ్, కందుల బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి వస్తున్న విశేషమైన జనాదరణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.