“రా.. కదలిరా”కు హాజరైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన “రా కదలిరా” కార్యక్రమానికి జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.