దూలపల్లి సత్యంను పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామం నందు ఎస్సి పేటలో గత కొంత కాలంగా పక్షవాతం కారణంగా మంచానికే పరిమితమైనటువంటి దూలపల్లి సత్యం పరిస్థితిని స్థానిక జనసైనికులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లాకి తెలియపరచడంతో విషయం తెలుసుకున్న డాక్టర్ శ్రీధర్ పిల్లా స్పందించి దూలపల్లి సత్యంను పరామర్శించిన కుటుంబ అవసరాల నిమిత్తం 25 కేజీలు బియ్యం ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలివెల నాని బాబు, కే రాజు, ఆకుల లావరాజు, రవి, జాన్సన్, సింగిల్ మల్లి సురేష్, రవి, పెద్ద తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-18.46.37-1024x576.jpeg)