డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో “నా సేన కోసం నా వంతు”

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పాడ కొనపాపేట గ్రామాల్లో జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల్ దాస్, మత్స్యకార నాయకులు పలివెళ్ల బాపన్న దొర మరియు జనసైనికుల సమక్షంలో గ్రామ పెద్దలతో కలిసి నా సేన కోసం నా వంతు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, రాజు, జాన్సన్, రాజు, నాని, లోవరాజు, మరియు జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.