పునః ప్రారంభమైన దుబాయ్ విమాన సర్వీసులు

దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ రోజు నుండీ సాధారణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. భారత్ నుంచి దుబాయ్‌కు విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.

జైపూర్-దుబాయ్ విమానంలో సెప్టెంబర్ 4న ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేశారు. ఈ వివరాలను దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల వెల్లడించింది. అయితే శనివారం నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని.. కరోనా మార్గదర్శకాలను పాటిస్తామని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది.