సింగరాయకొండలో జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించిన ఈదర హరిబాబు

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర క్రియాశీలక సభ్యుల శిక్షణా విభాగం చైర్మన్ ఈదర హరిబాబు పాల్గొని జనసేన జెండాని ఆవిష్కరించడం జరిగింది. కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాపకింద నీరుల వ్యాపించి, రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామికి వెన్నెముకగా మారి, కొండపిలో టిడిపి విజయానికి ముఖ్య పాత్ర జనసేన పోషిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన ముందంజలో ఉంది. ఎమ్మెల్యే, ఎంపి సీట్ల విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తారు. ఎన్నికల తర్వాత ఉమ్మడి ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుంది. స్థానిక ఎన్నికల్లో జనసేనకి అత్యధిక సంఖ్యలో ప్రాధాన్యత లభిస్తుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుంది. కనపర్తి మనోజ్ కుమార్ కి జిల్లాస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో అన్ని విధాలుగా పార్టీ నుండి సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటాము. ఆరు మండలాల అధ్యక్షులు పార్టీ కోసం పార్టీ ఎదుగుదల కోసం ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానం గుర్తించింది. రాబోయే రోజుల్లో కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులందరికీ మంచి ప్రాధాన్యత పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సింగరాయకొండలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు, జనసేనలో బలమైన అత్యధిక గ్రామస్థాయి నుండి కేడర్ ఉన్న మండలంగా సింగరాయకొండని తీర్చిదిద్దారు, వ్యూహం మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మనమందరం చూసుకుందాము. ఐనాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్ , సయ్యద్ ఖాజా హుస్సేన్, లింగంగుంట చంద్రవాస్, అత్యల సురేష్ బాబు, కర్ణ తిరుమలరెడ్డి లాంటి జనసేన నాయకులకు ప్రజలు ఎప్పుడు ఆదరఅభిమానం చూపిస్తూ ఉంటారు, జనసేన విజయానికి తోడ్పడతారు. భవిష్యత్తులో కొండపిలో జనసేన పోటీ చేసే అవకాశం వస్తే కచ్చితంగా నేను మాత్రం కనపర్తి మనోజ్ కుమార్ కి నా సపోర్టు ఎల్లవేళలా ఉంటుంది. నీతి నిజాయితీ ధైర్య సాహసాలతో కూడిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న నిస్వార్థపు ప్రజానాయకుడు కనపర్తి మనోజ్ కుమార్. జనసేన జెండా అనేది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల వారందరికీ ధైర్యాన్ని నింపుతుంది, నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన ఐనాబత్తిన రాజేష్ కి మండల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అంటూ ఈదర హరిబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల నాయకులు కమిటీ సభ్యులు వీరమహిళలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.