రెంట చింతల రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడం తీవ్రంగా బాధించింది: గాదె

గుంటూరు, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఎదో ఒక మూల ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంట చింతల మండలం వడ్డెరభావికి చెందిన 38 మంది టెంపో వాహనంలో శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో ఎర్ర వాగు సబ్ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురవడం దిగ్భ్రాంతి కలిగించింది. 8 మంది దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. మృతి చెందిన వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. వారి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే ధైర్యం ఇవ్వలాని దేవుడుని వేడుకుంటున్నానని అన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నానని, తీవ్ర గాయాలు పాలైన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నానని అన్నారు.

Janasena: అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి - OK Telugu