కాకినాడ జిల్లా కలెక్టరుకి మెమరాండం సమర్పించిన జనసేన

కాకినాడ సిటి, సోమవారం ఉదయం కాకినాడ సిటి జనసేన పార్టీ నాయకులు కాకినాడ జిల్లా కలెక్టరుకి మెమరాండం సమర్పించడం జరిగినది. 60 ఏండ్ల కిందట పేద, బడుగు, బలహీన వర్గాల బాలికలను సాంకేతిక విద్యలో నైపుణ్యం పొంది తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏర్పాటు చేసిన గరల్స్ పాలిటెక్నిక్ కళాశాలను నిర్వీర్యం చేసే దిశగా ఆ ప్రాంగణంలో కొంత భాగాన్ని ఆసుపత్రుల కోసం కేటాయించిడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తమ ఆందోళనని మెమరాండం ద్వారా తెలియచేసారు. అసలు ఈ కళాశాల ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా పొలిటెక్నిక్ కళాశాల అని, ఇందులో చదువుకునేందుకు వివిధ ప్రాంతాల విధ్యార్ధినులే కాక నేపాల్ వంటి దేశాల నుండి కూడా వచ్చి చదువుకునేవారని ఈ సందర్భంగా మీకు తెలియచేయుచున్నాము. అలాంటి కళాశాలకు చెందిన స్థలములో ఇతర కార్యకలాపాలను చేపట్టడం అంటే విధ్యార్ధినుల భద్రతలను విస్మరించడమే అని, ఇలాంటి పనులవల్ల మహిళా విద్యార్ధులకు అభద్రతకు లోనయ్యి, ఆసక్తి ఉన్నా చేరలేరని, ధైర్యం చేసి చేరినా ఏకాగ్రత కోల్పోతారని దీనిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా వ్యతిరేకతను తెలియచేయడం జరిగినది. ఎంతో ఉన్నత ఆశయంతో ఏర్పాటుచేసిన మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కొత్త కోర్సులతో అభివృద్ది చేయడం మాని అత్యవసరం అనే కారణంతో ప్రాంగణాన్ని తగ్గిస్తూ తద్వారా పేద, బడుగు, బలహీన విధ్యార్ధినుల మాన, ప్రాణాలకు రక్షణకు భంగం వాటిల్లేలా చర్యలు ఉపక్రమించడం దారుణమని వీటిని ఉపేక్షించడం తగదు. ప్రజల మనోగతాన్ని ప్రభుత్వానికి మీరు తెలియచేయవలసినదిగా ఈ మెమరాండం ద్వారా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్లా సత్యనారాయణ ప్రోగ్రాం కమిటీ సెక్రెటరీ నాని మనోహర్ కోటేశ్వరరావు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.