Anantapuram: వర్షం జనసేన ప్రచారాన్ని ఆపలేదు

అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసైనికులు.

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టిసివరుణ్ ఆదేశాల మేరకు మరియు పెనుగొండ నియోజకవర్గం నాయకుల కుమార్ ఆధ్వర్యంలో పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికలలో 13వ వార్డులో గాజు గ్లాసు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి మరియు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని శ్రీమతి బి.శ్రీదేవి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెనుగొండ ఎన్నికల ఇంచార్జ్ లు పత్తిచంద్రశేఖర్, అంకె ఈశ్వరయ్య, సంజీవ రాయుడు మరియూ జిల్లా ఉపాధ్యక్షులు జయరామి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్, మరియు కార్యదర్శులు మణికంఠ, కోనచంద్రశేఖర్ మరియు అనంతపురం అర్బన్ నాయకులు, రొద్దం మండలం నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.