ఏపీలో మొదలైన జెడ్పీటిసి, ఎంపిటిసిల ఎన్నికల పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం రాష్ట్రంలో 10 జెడ్పీటిసి, 123 ఎంపిటిసి స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 954 కేంద్రాల్లో ఈ పోలింగ్‌ జరుగుతుంది. జెడ్పీటిసి స్థానాల్లో 40 మంది, ఎంపిటిసి స్థానాల్లో 328 మంది బరిలో ఉన్నారు. 8,07,640 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈ నెల 18న లెక్కించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు.