చెన్నై టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్..

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతిని ఇచ్చింది. అలాగే రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అటు ఇంగ్లాండ్ టీం ఇద్దరి స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్, రవిచంద్రన్‌ అశ్విన్, చతేశ్వర్‌ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాంత్ శర్మ, నదీమ్

ఇంగ్లాండ్ జట్టు:

జో రూట్(కెప్టెన్), లారెన్స్, సిబ్లి, స్టోక్స్, బర్న్స్, బట్లర్, పొప్, ఆర్చర్, ఆండర్సన్, బెస్, లీచ్