ఆత్రేయపురం మండలంలో జనసేనలో చేరికలు

జనసేనాని లాంటి నిజాయితీపరుని ఆశయాలే ప్రజల్లో మార్పును, తీసుకు వస్తాయి. ఆత్రేయపురం మండలం నుంచి ఈ భారీ చేరికలే నిదర్శనం: బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆత్రేయపురం మండలంలోని, బొబ్బర్లంక, పేరవరం, తాడిపూడి, నార్కెడిమిల్లి గ్రామాల నుంచి శుక్రవారం భారీ స్థాయిలో జనసేన పార్టీలోకి, బండారు శ్రీనివాస్ నాయకత్వానికి, జేజేలు పలుకుతూ, సుమారు 200 మందికి పైగా వైసీపీ, టిడిపి లలో నాయకులుగా, కార్యకర్తలుగా, గ్రామ నాయకులుగా ఉన్న వారు, శుక్రవారం ఆత్రేయపురం మండలంలోని, 4 గు గ్రామాల నుంచి దళిత సోదరులు, బీసీ సోదరులు, శెట్టిబలిజ, ఓసి సోదరులు, పెద్ద ఎత్తున రాష్ట్ర జనసేన ప్రముఖ నాయకులు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వారిని, బండారు శ్రీనివాస్ నాయకత్వంలో ఈతకోట రాక సందర్భంగా కలిసి, జనసేనాని నాయకత్వానికి జై కొడుతూ, మద్దతు పలుకుతూ, జనసేన పార్టీలోకి వస్తున్నామని వారికి మాట ఇచ్చారు. ఈతకోట గ్రామం నుంచి అంతర్వేదికి పాదయాత్రకు నాదెండ్ల మనోహర్ జనసైనికులతో కలిసి మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా, వెళుతున్న సందర్భంగా వారిని సాగనంపి, అనంతరం, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ స్వగృహం వాడపాలెం నందు పార్టీలో చేరి ఉన్నారు. ఎంతో ప్రేమతో మర్యాదపూర్వకంగా వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. జనసేనాని ఆశయాలు పట్ల, పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై, జనసేన పార్టీకి, అధికారం లేకపోయినా, ఒక నీతిమఒతుడు, నిజాయితీపరుడైన, జనసేనాని నాయకత్వానికి, అండగా నిలబడతాం! మేము సైతం అంటూ ముందుకొచ్చి, బండారు శ్రీనివాస్ నాయకత్వంలో వాడపాలెం స్వగృహమునందు, ఆత్రేయపురం మండలంలోని, బొబ్బర్లంక, పేరవరం, తాడిపూడి, నార్కెడిమిల్లి గ్రామాలు నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, ఆత్రేయపురం జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణం రాజు నాయకత్వంలో, నాలుగు గ్రామాల, గ్రామ అధ్యక్షులు సమక్షంలో, శుక్రవారం జనసేన పార్టీలోకి చేరారు. బొబ్బర్లంక గ్రామం నుంచి పలువురు వైసిపి, టిడిపి పార్టీలోని వారు, చల్లపూడి శ్రీనివాస్, పొర్ల కాలేబు, చోడే బాబురావు, చిట్టా జాన్, చల్లపూడి రమేష్, వూటల రాజుతో పాటు, పలువురు కార్యకర్తలు, పేరవరం గ్రామం నుంచి వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన తలారి రమేష్, వర్ల బాలరాజు, పిట్టా రాజు, పిల్లి శ్రీనివాస్, బోచ్చే రాజు, తలారి ప్రశాంత్ కుమార్, గేడ్డం రాజు, పొర్ల బుల్లియ్య, కాకర్ల చిన్న అబ్బులు, తాతపూడి సత్యనారాయణ తోపాటు పలువురు కార్యకర్తలు, అదేవిధంగా తాడిపూడి గ్రామం నుంచి పిల్లి దుర్గారావు, ఓగి సత్య త్రిమూర్తులు, భోగి సూర్యనారాయణ వీరితోపాటు నార్కెడిమిల్లి గ్రామానికి చెందిన పెనుమత్స సీతారామరాజు, ముఖ్య నాయకులతో పాటు భారీ ఎత్తున జనసేన పార్టీలోకి యువత అధిక సంఖ్యలో బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేన పార్టీ లో చేరి ఉన్నారు ఈ కార్యక్రమమునకు విచ్చేసిన పలువురికి ధన్యవాదాలు తెలియజేశారు.