గుమ్మలూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు

గుమ్మలూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న రణస్థలం, శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ రావి హరీష్ ఆధ్వర్యంలో మరియు పోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడాల రాజేష్ అద్యక్షత వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్ మాట్లాడుతూ గుమ్మలూరు గ్రామంలో ఏ సమస్య ఉన్న వాటిపై జనసేన పార్టీ ద్వారా పరిష్కరించే దిశగా పోరాటం చేస్తానని సభాముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆచంట మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ జవాది బాలాజీ శ్రీనివాస్, పెనుగొండ మండల ప్రెసిడెంట్ కంబాల బాబులు, పెనుమంట్ర మండల ప్రెసిడెంట్ కోయ వెంకట కార్తిక్, జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, ఆచంట టౌన్ అధ్యక్షులు నంబూరు విజయ్, కోడేరు గ్రామ అధ్యక్షులు కుంపట్ల రమేష్, సీనియర్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట తాతాజీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కడలి శ్రీనివాసరావు, నాయకులు పితాని లక్ష్మణ్, ముకే గోవిందరాజులు, మల్లోజ్ పవన్, కొప్పినీడి భాస్కర్, గేదెల గోపి, లక్ష్మీ నరసింహ, లారెన్స్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.