జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం రాష్ట్ర కమిటీ ఏర్పాటు

జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ హైకమాండ్ నేడు ప్రకటన విడుదల చేసింది. 14 మందితో కూడిన ఈ కమిటీకి జనసేనాని పవన్ కల్యాణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ రాష్ట్ర కమిటీకి కల్యాణం శివ శ్రీనివాస్ ను ఇంతకుముందే సమన్వయకర్తగా నియమించారు. తాజాగా సంయుక్త కోఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను నియమించారు. చోడిశెట్టి చంద్రశేఖర సుబ్రహ్మణ్యం, సయ్యద్ విష్వక్సేన్ లను జాయింట్ కోఆర్డినేటర్లుగా నియమించారు.