అదుపుతప్పి ఆర్టీసి బస్సు బోల్తా.. మంత్రి పువ్వాడ దిగ్భ్రాంతి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపతప్పి బోల్తా పడింది.భూపాలపల్లి వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంథని దాటాక… ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెళుతూ లోయలో పడింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 ఈ ఘటనపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న పరకాల డిపో బస్సు.. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌ సమీపంలోని గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు.

బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌, వరంగల్ రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.