జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో ముఖా-ముఖి

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రైతులతో ముఖా-ముఖి లో పాల్గొన్న జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ మడకశిర పట్టణ అధ్యక్షుడు యశ్వంత్ గుడిబండ మండల అధ్యక్షులు మంజునాథ్, మడకశిర పవన్ కళ్యాణ్, హరీష్ జనసైనికులు పాల్గొని వాళ్ల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల పక్షాన జనసేనపార్టీ ఎప్పుడు అండగా వుంటుంది అని భరోసా ఇచ్చారు. రైతులు పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉందని దానికి నిదర్శనం అయన కౌలు రైతులకు అందిస్తున్న సాయం అని వచ్చే ఎన్నికల్లో ఆయనకే పట్టం కడతాం అని చెప్పారు.