రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి: మరీదు శివరామకృష్ణ

నూజివీడు రూరల్, మండలంలోని మల్లవల్లిలో ఇండస్ట్రీలలో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మల్లవల్లి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు జనసేన పార్టీ ప్రతినిధి బృందం సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ 2016 లో రైతుల వద్ద భూములు తీసుకొని నేటికీ నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. ఈ 124 మంది మల్లవల్లి పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి శాపంగా మారుతాయి అని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కృష్ణాజిల్లా కార్యదర్శి, గన్నవరం నియోజకవర్గ నేత బండ్రెడ్డి రవి, సంయుక్త కార్యదర్శి చిమట రవివర్మ, విజయవాడ రూరల్ మండలం అధ్యక్షులు పోదిలి దుర్గారావు, నూజివీడు మండలం అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, చాట్రాయి మండలం అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, ఆగిరిపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్, కార్యదర్శి యలవర్తి సువర్ణ బాబు, కూరాకుల ప్రసాద్, జనసేన వీర మహిళ నాయకురాలు శ్రీపతి శిరీష, జక్కుల లక్ష్మి, బాపులపాడు మండలం ఉపాధ్యక్షులు హైటెక్ నాని, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీధర్, సాయికిరణ్, రైతులు దొనవల్లి వెంకట్రావు, పంతం కామరాజు, చిన్నాల సత్యనారాయణ, పోలవరపు నాగమణి తదితరులు పాల్గొన్నారు.