నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయమందించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాన బాలకృష్ణ ఐ పోలవరం మండలం పెద్దమడి గ్రామంలో జాంబవుల మెరకలో లంక వెంకటరమణ నివాస గృహములో గ్యాస్ లీకేజ్అవ్వడంతో పాక్షికంగా దెబ్బతిన్న ఇంటిని సందర్శించి వారికి 50 కేజీల బియ్యం, మూడువేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన అకాల మరణం చెందిన అయినవిల్లి వీర వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు కనకాలపేట గ్రామంలో గుత్తిన దీవి గ్రామస్తులు ప్రమాదవశాత్తు గాయపడిన రాయపరెడ్డి దుర్గారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జున రావు, మండల అధ్యక్షులు మద్దంశెట్టి పురుషోత్తం, సీనియర్ నాయకులు రాయపరెడ్డి బాబి, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దేవి రాంబాబు, దూడల స్వామి, సవరపు వెంకట్, కమిటీ వైస్ ప్రెసిడెంట్ పాటి శ్రీను, సలాది రాజా, గంజా యేసు, వాసంశెట్టి బాబ్జి, ఇండుగల రామకృష్ణ, మామిడాల బాబులు, పాటి హరికృష్ణ, యాళ్ళ బాబ్జి, రాయపురెడ్డి బుజ్జి తదిరులు పాల్గొన్నారు.