తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో తగరపు శ్రీనివాస్ అధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోకి జనసేన పార్టీ సిద్దాంతాల్ని, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల నాయకులు పొడిశెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, మద్ది స్వామి, పొడిశెట్టి అఖిల్, సురేష్, బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు.