కష్ట కాల సమయంలో పేద కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం..

ఆముదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో జనసేన నాయకులు కొల్ల జయరాం, తులగాపు మౌళి ఆధ్వర్యంలో మరియు గ్రామ జనసేన నాయకులు సమక్షంలో ఇటీవల చనిపోయిన పాడి రామినాయుడు కుటుంబానికి జనసేన తరుపున 24000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. భవిష్యత్ లో తమ కుటుంబానికి అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో, కిల్లాన. నరేష్, సిక్కోలు.విక్రమ్ (ప్రాదేశిక. ఎంపీటీసీ) తులగాపు తిరుపతి, రుద్ర, జోగినాయుడు, భాస్కర్, ప్రదీప్, రాజేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.