జోగి కొండపై మంటలు..

శ్రీకాకుళం: ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు పాతపట్నం జోగి కొండపై గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. వందల ఎకరాలు కాలి బూడిదవుతున్నాయి. వన్య ప్రాణాలకు ప్రాణ ముప్పు ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి, ఒడిశా పర్లాకిమిడి ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.