జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి అధ్వర్యంలో ఓపెన్ జిమ్ శంకుస్థాపన

గాజువాక, జివిఎంసి 64వ వార్డు పరిది యాతపాలెం గ్రామంలో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి అధ్వర్యంలో ఓపెన్ జిమ్ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది, కార్పొరేటర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ గా గెలిచి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా వార్డు అభివృద్ధి కానుకగా ఇచ్చిన 5 లక్షల రూపాయల నిధులతో యాతపాలెం గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయటం జరుగుతుందని గ్రామ ప్రజలు అందరూ జిమ్ ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, వైసీపీ నాయకులు దేవన్ రెడ్డి, గ్రామ ప్రెసిడెంట్ సమ్మంగి అప్పల నాయుడు, గోడ్డు కన్నరావు, గ్రామ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళలు, జివిఎంసి సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొనటం జరిగింది.