జనసేన ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సరఫరా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురం గ్రామంలో ఐదు రోజులపాటు జరుగు పెద్దమ్మ తల్లి కొలుపు ఉత్సవాలకు స్థానిక జనసేన విద్యార్థి విభాగం, జిల్లా నాయకులు గొల్ల వీరభద్రం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉచిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గొల్ల పెంటయ్య, ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి, గ్రామ పెద్దలు గొల్ల నారాయణ, గోగ్గల అధినారయణ, కుంజ రామ్మూర్తి, జక్క రాంబాబు, వసం రమేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, యువజన విభాగం జిల్లా సెక్రెటరీ గరిక రాంబాబు, కొడిమే వంశీ, కందుకూరి వినీత్, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు పొడిచేసి చెన్నరావు, ముదిగొండ సాగర్, చిర్ర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.