2022 చివరినాటికి సాధారణ పరిస్థితులు: బిల్ గేట్స్

2022 చివరి నాటికి కరోనా మహమ్మారి నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని మైక్రోస్టాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ విజృంభణ ఓ ఊహించలేని విషాదం అని, అయితే గుడ్‌న్యూస్ ఏంటంటే.. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడమే అని గేట్స్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న కోవాక్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తున్నది. అత్యధిక నిధులు గేట్స్ సంస్థ నుంచి వెళ్తున్నాయి. ఇక కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సంస్థలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. 2022 చివరినాటికి సాధారణ స్థితికి వస్తాయని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.