సంక్రాంతి సందర్భంగా నూతనవస్త్రాలు పంచిన జనసేన

ఆకివీడు, సంక్రాంతి సందర్భంగా నంద్యాల శివ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉండి నియోజకవర్గం ఆకివీడు మండల జనసేన పార్టీ తరఫున శనివారం సుమారు 450 పెన్షన్ మందికి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గవరలక్ష్మి అలాగే ఆకివీడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి తాతాజీ అలాగే స్టేట్ ప్రోగ్రామ్స్ కమిటీ సెక్రటరీ తోటవాసు, అలాగే కుప్పం పూడి జనసైనికులు ఆకివీడు మండల జనసైనికులు పాల్గొన్నారు.