రైతు దినోత్సవ వేడుకలలో ఆముదాలవలస జనసేన

ఆముదాలవలస: జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు స్పూర్తితో ఆముదాలవలస నియోజకవర్గం జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, ఎంపీటీసీ విక్రమ్ మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిదిలోని రైతులను మరియు కౌలు రైతులను కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం రైతులకు పార్టీ తరుపున గౌరవంగా సన్మాన కార్యక్రమం చేసి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సేవలు మరియు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విదంగా రైతులకు అండగా ఉంటారో వివరిస్తూ.. జనసేన ప్రభుత్వం వస్తే వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారికి నేరుగా వ్యవసాయ శ్రమ చేసినవారని ఆయనకు రైతుల ఆవేదన అర్థం చేసుకున్న నాయకుడని, రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు ఆదుకోవడానికి 30 కోట్లు కేటాయించి ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఇచ్చిన దేశంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని జనసైనికులు అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా రైతుకి నెలకి 5000 నుంచి 8000 రూపాయలు పెన్షన్ వస్తుందని, మరియు వివిధ సోలార్, ఉచిత కరెంట్ వంటి హామీలను వివరించారు. . ఈ కార్యక్రమంలో రైతులు మరియు సైనికులు మౌళి, శ్రీను, మోహన్, రుద్ర, అశోక్, కోమల్, సాయి పాల్గొన్నారు.