ఈ ఏడాది కి హెచ్-1 బీ వీసా లాటరీలోనే
అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి భారతీయులు సహా విదేశీయులకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాల మంజూరు పక్రియలో ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన మార్పుల్ని జో బైడెన్ సర్కార్ వాయిదా వేసింది. ఈ ఏడాది కూడా సంప్రదాయ లాటరీ విధానం ద్వారా వీసాలు జారీ చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు లాటరీ విధానమే అమల్లో ఉంటుందని సృష్టం చేసింది. కొత్త వీసా విధానం ప్రకారం రిజిస్ట్రేషన్ వ్వవస్థలో మార్పులు చేర్పుల కోసం అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీఎస్(యూఎస్సీఐఎస్) వెల్లడించింది. హెచ్-1బీ వీసా కింద అమెరికాలో పలు టెక్ కంపెనీలు భారత్, చైనా ఇతర దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగాల్లో తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ అధికారంలో ఉండగా ఈ వీసాల జారీ పక్రియలో కంప్యూటరైజ్డ్ లాటరీకి స్వస్తి పలికి ప్రతిభ ఆధారిత విధానం తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం మార్చి 9 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే దీని అమలుకు అవసరమైన రిజిస్ట్రేషన్ వ్వవస్థ, ఎంపిక పక్రియలో మార్పులకు మరింత సమయాన్ని ఇస్తూ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ కొత్త విధానం అములకు మార్చి 9 నుంచి డిసెంబర్ 31కి వాయిదా వేసినట్లుగా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వివరించింది.