ఘనంగా ఓర్సు రాజేందర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ, నర్సంపేట, మంగళవారం జనసేన పార్టీ నర్సంపేట మండల ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్ జన్మదిన సందర్భంగా నర్సంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వంగ మధు ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు శివకోటి యాదవ్ హాజరై, రాజేందర్ జనసేన పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడుతూ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు వంగ మధు, ఉపాధ్యక్షులు కుండే రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బ పృథ్వీరాజ్, ఎలబోయిన డేవిడ్, కార్యదర్శులు రొడ్డ శ్రీకాంత్, పోశాల కార్తీక్, కొమ్ము రంజిత్, గద్దల కిరణ్, ఎలుక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.