ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడిగా హరిప్రీత్‌సింగ్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ హరిప్రీత్‌సింగ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికకు సంబంధించి విజ్ఞప్తులు, కోడ్‌ ఉల్లంఘనలపై హరిప్రీత్‌సింగ్‌కు నేరుగాగానీ, 94406 83720 మొబైల్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, పరిశీలకుడికి సమన్వయకర్తగా ఉన్న జేడీ విల్సన్‌ (97044 56521)కైనా ఫిర్యాదు చేయొచ్చని రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక ఆల బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.