కంబదూరు మండలంలో భారీ బైక్ ర్యాలీ

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా, కంబదూరు మండలం జనసేన పార్టీ జనహితం కోరే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అయిన సందర్భంగా మండలం అధ్యక్షుడు చంద్రమౌళి ఆధ్వర్యంలో కంబదూరు మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి అని స్థానిక జనసైనికులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి ధర్మవరం మద్య ప్రధాన రహదారి అయిన నూతిమడుగు దగ్గర గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కూలిపోవడం దానికి నామమాత్రంగా మరమత్తులు చేయడాన్ని తీవ్రంగా ఖండించం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకుల శ్రీనివాసులు, జగదీష్, వెంకటేశులు, నరేష్, తిప్పే స్వామి, అనిల్, రాంప్రసాద్, గంగాధర్, గోవింద, శ్రీకాంత్, మునీంద్రా, రాము, అశోక్, రవికృష్ణ, చిరంజీవి, శ్రవణ్, క్రాంతి, శ్రీనివాసులు, జగదీష్, రవి, పవన్, హనుమంత్, రాజశేఖర్, విష్ణు, చిత్తన్న, హరి, వంశీ, కిరణ్, శివ, హనుమంత్, మూర్తి, జాని, రఘు, ఈరన్న, చందు, నితిన్, ఎర్రి స్వామి, చంద్ర నాయక్, సుబ్బు, శివ, గణేష్, శృజన్, శేఖర్, రవి, నరేంద్ర, అజయ్, రాజు, నవీన్, అనిల్, గోపాల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.