300 కార్లతో భారీ ర్యాలీ

నర్సాపురం, జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరగబోయే భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి 300 కార్లతో ర్యాలీగా వెళ్ళడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రం మరియు నియోజకవర్గం నుండి జనసేన మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.