దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని గెలిపించు కుందాం!!

  • అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి మద్దతుగా 41, 47వ డివిజన్ లలో ప్రచారం నిర్వహించిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనీ స్థానిక 41, 47వ డివిజన్ లలో గురువారం కూటమి ఉమ్మడి ప్రచారం కొనసాగింది ఈ ప్రచారంలో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి పాల్గొని దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారికి ఓటు వేయాలని అభ్యర్థించి ఉమ్మడి మ్యానిఫెస్టోలో ముఖ్యమైన అంశాలైన ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15వేళ రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం,యువతకి ప్రతి ఏడాదికి 20లక్షల ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరిస్తూ.. అనంతపురం అర్బన్ నియోజక వర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన అవినీతి అనంత వెంకటరామిరెడ్డి ని ఓడించి శ్రీ దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారిని గెలిపించుకొని రాష్ట్రంలో కూటమి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళవాయి రమాదేవి, దళవాయి వెంకటేష్, దూదేకుల శుభహని, ఈశ్వరమ్మ, వీరమహిళలు శైలజ, గురులక్ష్మి, గాయత్రి, సానియా తదితరులు పాల్గొనడం జరిగింది.