ఐ.పంగిడి గ్రామానికి చెత్త రిక్షాల డిమాండ్

కొవ్వూరు నియోజకవర్గం, ఐ. పంగిడి మేజర్ పంచాయతీ పరిధిలో చెత్త రిక్షాల కొరత వల్ల గ్రామంలో చెత్త ఎక్కువగా పేరుకుపోతోంది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్త చెత్త రిక్షాలను వెంటనే కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ సమస్యను సోమవారం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ. పంగిడి జనసేన పార్టీ నాయకుడు డి.ఎన్.ఎల్. ప్రసాద్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment