పులివెందుల పులి అని చెప్పుకొనే జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే జీవో 1 రద్దు చేయాలి: పెండ్యాల శ్రీలత

అనంతపురం, మీడియా సమావేశంలో రాయలసీమ ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ… ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడుని కలిస్తే వైసీపీ కుక్కలు ఇష్టం వచ్చినట్లు మొరుగుతున్నాయి.

  • విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకొని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ ఘటన తరవాత చంద్రబాబు వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిసి మాట్లాడారు.
  • ఇప్పుడు చంద్రబాబుని కుప్పంలో వైసీపీ ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడారు.
  • జీవో నెంబర్ వన్ ద్వారా ప్రతిపక్షాలను ఆపాలని కుట్ర చేశారు. పిరికి ప్రభుత్వం ఇది. ఇలాంటి చేతగాని, పిరికివాళ్లు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు.
  • పులివెందుల పులి అని చెప్పుకొనే జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే జీవో 1 రద్దు చేయాలి. పిరికి పిల్లి కాబట్టే ప్యాలెస్ కదిలి రాకుండా గాల్లో తిరుగుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గర మంత్రులుగా ఉన్న చెంచా బ్యాచ్ నోరు పారేసుకొంటోంది
  • మంత్రుల చరిత్రలు అందరికీ తెలుసు
  • శవాల మీద పేలాలు ఏరుకునే నీచుడు ఒక మంత్రి. సిగ్గు లేకుండా అవసరాలు ఉంటాయి కాబట్టి డబ్బులు తీసుకొంటాను అంటాడు. అలాటి వాడు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కాలి గోటుకి సరిపోని వ్యక్తులు వైసీపీ మంత్రులు
  • పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పేద ప్రజలు, రైతుల క్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటారు.
  • ఆయన ఒక అడుగు వేసినా, ఎవరినైనా మర్యాదపూర్వకంగా కలిసినా వణుకుతూ ఉన్న వైసీపీ వాళ్లకు. వారాహి వాహనం మీద పర్యటన మొదలు పెడితే గుండె ఆగి చస్తారని అన్నారు.