ప్రజలు సంతోషంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలి: గురాన అయ్యలు

  • విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

విజయనగరం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ఉదయం జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు ఆధ్వర్యంలో స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్దనున్న హొటల్ జి.ఎస్.అర్. లో ఉన్న పార్టీ కార్యాలయంలో జనసైనికుల మధ్య నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ముందుగా కేక్ ను కోసి వేడుకలను ప్రారంభించారు, అనంతరం జనసేన నాయకులు, జనసైనుకులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, వైసిపి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నూతన సంవత్సరంలో రాజకీయాల్లో ప్రజలందరూ మార్పును కోరుకోవాలని,ముఖ్యంగా దేశానికి వెన్నుముక ఐన యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక డిగ్రీ పట్టాలు చేతపట్టుకొని వలసలు వెళ్లి పోతున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. జనవరి 12న, శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరగబోయే యువశక్తి సభకు భారీగా యువతీ యువకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గిరడ అప్పలస్వామి, పాండ్రంకి అప్పారావు, ఉల్లి సంతోష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు డోల రాజేంద్రప్రసాద్, పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, పార్టీ కార్యనిర్వాహక సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువ నాయకులు పిడుగు సతీష్, ఏంటి రాజేష్, రవీంద్ర, పవన్, బాబు, వాసు, కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.