పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెడితే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుదాం

  • జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు

నంద్యాల నియోజకవర్గం: నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా వారు సమావేశంలో మాట్లాడుతూ.. తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి నాలుగో విడత యాత్ర తదుపరి షెడ్యూల్ లో భాగంగా ముఖ్య నేతలతో చర్చించడానికి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడుని పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా చిత్రీకరించి పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు మరియు పోలీస్ అధికారుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ను కావాలనే పోలీసులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవబోతున్నారని అభూత కల్పనలు సృష్టిస్తూ తమ నాయకుడిని అడ్డుకోవడాన్ని తప్పు పట్టారు. ఈ సందర్భంగా రాచమడుగు సుందర్, మాట్లాడుతూ తమ నాయకుడిని, జనసేన నాయకులను, వీరమహిళలను ప్రభుత్వ పోలీసులు అడ్డుకుంటూ పోతే జనసైనికులు, జనసే నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గొస్పాడు జనసేన నాయకులు సాయిప్రదీప్ రెడ్డి, జనసైనికులు ఫకృద్దిన్, అభి, చిన్న పాల్గొన్నారు.