అంగరంగ వైభవంగా నకరికల్లు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు

  • జనసేన పార్టీ మీద, మా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు రుణపడి ఉంటాం: బోనబోయిన, గాదె.

నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలో జనసేన పార్టీ జెండాల ఆవిష్కరణకు, నకరికల్లు గ్రామ కమిటీ సభ్యులు మరియు పెద్దల ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు మరియు జిల్లా కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ పొలిమేర నుంచి జెండా ఆవిష్కరణకు వెళ్లే దారి పొడవునా భారీ ర్యాలీ, డీజే, పెద్దల ఆశీర్వచనాలతో, నీరాజనాలతో, మహిళల హారతులతో అంగరంగ వైభవముగా జరిగింది. జనసేన పార్టీ నగరికల్లు గ్రామ కమిటీ వారు ఏర్పాటు చేసిన నాలుగు నూతన పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యాలరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవనారాయణ, జిల్లా కార్యదర్శి ఎర్రం శెట్టి రామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శిలు సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, పట్టణ నాయకులు రాడ్లు శీను, పార్టీ కార్యాలయం ఇన్చార్జ్ సిరిగిరి మణికంఠ, బీరవల్లిపాయ ఉపసర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి, అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, నకరికల్లు మండలం ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, నాగూర్ వలి, గ్రంధి సాదాశివరావు, బెల్లంకొండ అనిల్, మేడికొండూరు మండల అధ్యక్షులు నాగబాబు, బాదునీడి సుబ్బారావు,గ్రామ అధ్యక్షులు చేపురి వెంకటేశ్వర్లు, తిరుమల శెట్టి గోపి, రుద్ర జడ శివయ్య, మరియు సైదారావు, హర్ష, షేక్ గౌస్ కరీం, రామాంజనేయులు, వెంకటేష్, పోతంశెట్టి వెంకటేష్, యద్దనపూడి నరేష్, అమరగుత్తి నాగరాజు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.