పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తక్షణమే అమలు

వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా రాయితీ గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతునట్టు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ అనూహ్య నిర్ణయంతో సామాన్యుని నెత్తిన అధిక భారం పడినట్టైంది. . హైదరాబాద్‌లో ఇప్పటివరకు సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది.