ఇక పై యూపీలో ఆస్కీమ్ రద్దు

44 ఏళ్ల క్రితం నాటి నుండీ కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించే స్కీమ్ ఒకటి యూపీ రాష్ట్రంలో ఉన్నది. ఆ స్కీమ్‌కు ఇప్పుడు యోగి సర్కార్ ముగింపు పలకాలనుకుంటుంది. భిన్న విశ్వాసాల ప్రజల మధ్య జరిగే వివాహ ప్రక్రియలను ప్రోత్సహించేందుకు 1976లో ప్రవేశపెట్టిన స్కీమ్‌ను ఇప్పుడు రద్దు చేయాలని భావిస్తున్నారు. ఈ స్కీమ్‌ను యూపీలోని నేషనల్ ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ చూస్తున్నది. యూపీ నుంచి విడువడిన ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఈ స్కీమ్‌ను రద్దు చేయాలని భావిస్తున్నది. ఈ స్కీమ్ కింద.. మతాంతర వివాహం చేసుకున్న వారు.. పెళ్లి జరిగిన రెండేళ్లలోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆమోదం పొందిన దంపతులకు 50వేల నగదు ఇస్తారు. గత ఏడాది ఈ స్కీమ్ కింద 11 జంటలు లబ్ధిపొందాయి. కానీ ఈ ఏడాది ఒక్కరికి కూడా అమౌంట్ రిలీజ్ చేయలేదు. ఈ స్కీమ్ కోసం నాలుగు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మతమార్పుడులకు పాల్పడేవారికి పదేళ్లు కఠిన శిక్ష అమలు చేయనున్నట్లు ఇటీవల యోగి సర్కార్ ఓ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ క్లియరెన్స్ కూడా దక్కింది.

ఇప్పటికే లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మతమార్పుడులను అడ్డుకునేందుకు యూపీ సర్కార్ కొత్త చట్టాన్ని తెస్తున్న విషయం తెలిసిందే.