తెలంగాణలో పెరిగిన కరోనా నిర్ధారణ కేసుల సంఖ్య

తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2,058 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,60,571కు చేరింది. తాజాగా కోలుకున్న వారి సంఖ్య 2,180 కాగా.. 1,29,187 మంది ఇండ్లకు చేరుకున్నారని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.45శాతంగా ఉందని వివరించింది. 23,534 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. సోమవారం 51,247 నమూనాలు పరిశీలించగా, మొత్తం 22,20,586 టెస్టులు చేసినట్లు తెలిపింది.