దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఎర్రకోట వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించిన మోదీ అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.

ప్రధానిగా నరేంద్ర మోదీ 8వసారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశ ప్రజలకు స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ విభజన గాయాలు నేటికి వెంటాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యసిబ్బందిని ప్రధాని మోదీ కొనియాడారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారు దేశానికే స్ఫూర్తి అంటూ అభినందించారు. ఇండియా బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించుకున్నారు.